శ్రీదేవిది కిడ్నాప్ కాదు, భర్తతో విభేదాలు: పోలీసులు
విజయవాడ: విజయవాడ నగరంలోని సంపన్న కుటుంబానికి చెందిన గృహిణి మైనేని శ్రీదేవి అభినయ (24) గురువారం ఉదయం కిడ్నాప్ అయిన ట్టు అనుమానించినా, అది కిడ్నాప్ కాదని, భర్తతో విభేదాల కారణంగానే ఆమె హైదరాబాద్ వచ్చిందని శుక్రవార విజయవాడ పోలీసులు స్పష్టం చేశారు. తాను హైదరాబాద్లో ఉన్నట్టు శ్రీదేవి తన బంధువులకు ఫోన్ చేసిందని వారు చెప్పారు. శ్రీదేవి ఎక్కడుందో తెలుసుకోడానికి ప్రత్యేక పోలీసు బృందాలను హైదరాబాద్కు పంపుతున్నట్టు విజయవాడ పోలీసులు తెలిపారు. శ్రీదేవి కిడ్నాప్ కట్టు కథ అని ఒక రోజు తర్వాత స్పష్టమైంది. నిన్న పోలీసులకు అందిన సమాచారం ఇలా ఉంది.
నాగులచవితి రోజున శివాలయానికి దైవదర్శనం కోసం వెళ్ళిన శ్రీదేవి కిడ్నాప్ అవడం విజయవాడలో సంచలనం కలిగించింది. గుణదలలోని శివాలయం వద్ద ఉదయం 6.30 గంటల సమ యంలో ఈ సంఘటన జరిగినట్టు పోలీ సులకు సమాచారం అందింది. మైనేని శ్రీదేవి అభినయ (24), ఆమె భర్త క్రాంతికుమార్ ఆర్టీసి కాలనీలో నివసిస్తు న్నారు. గురువారం నాగుల చవితి కావ డంతో ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి గుణదలలోని శివాలయానికి వెళ్ళి వస్తా నని తానే స్వయంగా హోండా సిటీ కారు ్రడైవ్ చేసు కుంటూ గుడికి వెళ్ళారు. గుణదలలోని శివాలయానికి ఆమె నాయనమ్మ మైనేని దేవి చైర్మన్ కావడంతో అర్చకులు ప్రత్యేక శ్రద్ధతో ఆమె చేత పూజలు నిర్వహిం పచేశారు. ఆ తరువాత ఆమె ఇంటికి చేరలేదు.
ఉదయం 7.30 గంటల సమయంలో శ్రీదేవి భర్త క్రాంతికుమార్ సెల్కు 08644224270 నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన ఆగంతకుడు "నీ భార్యను కిడ్నాప్ చేశాం. 50 లక్షలు తీసుకువచ్చి ఇస్తే వదిలేస్తాం అని ఫోన్ పెట్టేశాడు. దీంతో కంగారుపడిన క్రాంతికుమార్ వెంటనే గుడి దగ్గరకు వెళ్ళారు. తమ కారు అక్కడే కనిపించింది. చుట్టుపక్కల వారిని అడగ్గా ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. అర్చ కులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేకపపోయారు. దీంతో క్రాంతికుమార్ వెంటనే మాచ వరం పోలీసు స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. శ్రీదేవికి, విజయవాడలో ప్రముఖ ఆర్కిటెక్గా పనిచేస్తున్న ఇంజనీర్ క్రాంతి కుమార్తో 2004 లో వివాహం జరిగింది.