వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టాలు తప్పిన ఫలక్‌నుమా బోగీ: ప్రయాణికులు క్షేమం

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లా సిరిపురం వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీ ఒకటి పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేదీ సంభవించలేదు. రైళ్ల రాకపోకలకు మాత్రం తీవ్ర అంతరాయం కలిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తుండగా సిరిపురం వద్ద సోమవారం తెల్లవారుజామున ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌ - 11 బోగీ పట్టాలు తప్పింది. ఈ విషయం గమనించిన డ్రైవర్‌ వెంటనే రైలును ఆపేశాడు. దీందో ఘోర ప్రమాదం తప్పింది.

విషయం తెలిసిన వెంటనే సహాయ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముందు బోగీలను విడదీసి నల్లగొండ మీదుగా సికింద్రాబాద్‌కు, వెనక బోగీలను గుంటూరు, విజయవాడల మీదుగా సికింద్రాబాద్‌కు మళ్లించారు. కొచ్చిన్‌ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించారు. ఆరు రైళ్లను రద్దు చేశారు. పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ కూడా రద్దయింది. కొన్ని ప్యాసెంజర్‌ రద్దయింది. విజయవాడ, చెన్నై పినాకిని ఎక్స్‌ప్రెస్‌ను బాపట్ల నుంచి వెనక్కి మళ్లించారు. నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ చాలా సేపు విజయవాడ స్టేషన్‌లో నిలిచిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X