ల్యాంకోహిల్స్ కు భూకేటాయింపుపై స్టే
హైదరాబాద్:
హైదరాబాదులోని
ఖరీదైన
ప్రాంతం
మణికొండలో
ల్యాంకోహిల్స్
కు
ప్రభుత్వం
జరిపిన
భూకేటాయింపుపై
రాష్ట్ర
హైకోర్టు
గురువారం
స్టే
ఇచ్చింది.
తదుపరి
ఉత్తర్వులు
వెలువడే
వరకు
ఏ
విధమైన
నిర్మాణాలు
చేపట్టకూడదని
హైకోర్టు
ఆదేశాలు
జారీ
చేసింది.
మణికొండలో
ల్యాంకోహిల్స్
కే
కాకుండా
కొన్ని
ఐటి
కంపెనీలకు
ప్రభుత్వం
17
వందల
ఎకరాలు
కేటాయించింది.
ఈ
కేటాయింపును
సవాల్
చేస్తూ
తెలంగాణ
రాష్ట్ర
సమితి
(తెరాస)
నాయకుడు
రెహ్మాన్
పిటిషన్
దాఖలు
చేశారు.
మణికొండలో
ల్యాంకోహిల్స్
కోట్ల
రూపాయలకు
120
ఎకరాల
భూమిని
కొనుగోలు
చేసింది.
ఆ
భూమిలో
ల్యాంకోహిల్స్
నివాస
సముదాయాల
నిర్మాణానికి
పూనుకుంది.
ఈ
భూమి
కేటాయింపుపై
హైకోర్టు
స్టే
ఇవ్వడం
వల్ల
తమకొచ్చే
నష్టమేమీ
లేదనే
ధీమాతో
ల్యాంకోహిల్స్
ఉంది.
ప్రభుత్వానికి
డబ్బు
చెల్లించి
తాము
భూమిని
కొలుగోలు
చేశామని,
తమకు
భూమిని
అప్పగించే
పని
ప్రభుత్వమే
చూసుకుంటుందని
కంపెనీ
యాజమాన్యం
అంటోంది.