ప్రశాంత్ రెడ్డిని నేనే కాల్చి చంపా: వెంకట్
హైదరాబాద్: రియల్టర్ ప్రశాంత్ రెడ్డిని తానే కాల్చిచంపానని సిఐడి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిందితుడు వెంకట్(పిసిసి మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు కుమారుడు) పేర్కొన్నట్టు, ఆ వాంగ్మూలం దొరికిందని ప్రైవేట్ టెలివిజన్ చానెల్లు ఫ్లాష్ న్యూస్ ప్రసారం చేశాయి. వివరాలు ఇలా ఉన్నాయి...భూతగాదాల కారణంగా తానే కాల్చిచంపాను..ఆ రోజు 3 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన ప్రశాంత్ తో కలిసి మద్యం సేవించాం...భూ తగదా చర్చకు వచ్చింది...తాను రివాల్వర్ ఎక్కు పెట్టగా ప్రశాంత్ భయపడి లేచినిలబడి తనతో పెనుగులాడాడు... అయినా క్షణికావేశంలో కాల్చాను... ఆ వెంటనే అతను సోఫాలో పడిపోయాడు...అని వెంకట్ పేర్కొన్నట్టు వార్తా ఛానళ్లు ప్రసారం చేశాయి.












Click it and Unblock the Notifications