వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమశిల నీటిలో పడవ మునక: 3గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews


కడప: కడప జిల్లా చుక్కాయపల్లి గ్రామం వద్ద సోమశిల బ్యాక్ వాటరులో పడవ మునిగి బుధవారం ఉదయం ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 11 మంది ప్రయాణిస్తున్నారు. గత 2, 3 నెలలుగా కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల బ్యాక్ వాటర్ బాగా పెరిగింది.

సోమశిలకు సంబంధించి ముంపు ప్రమాదం ఉన్న గ్రామాలు 105 దాకా ఉన్నాయి. ఆ గ్రామవాసులకు పునరావాస సౌకర్యం కల్పించలేదు. ఐదారు గ్రామాల ప్రజలకు పరిహారం కూడా చెల్లించలేదు. గతంలో గట్లువరం గ్రామంలో ఒక మహిళ కూడా ఈ బ్యాక్ వాటరులో మునిగి చనిపోయింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X