వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏనుగుల బెడదపై ఆపరేషన్ గజ షురూ

By Staff
|
Google Oneindia TeluguNews


శ్రీకాకుళం: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు ఆపరేషన్ గజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక వైపు ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే ఏనుగులు మరో వ్యక్తిని చంపేశాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సరిహద్దులోని గడ్డ తిరువాడలో ఏనుగులు ఒక వ్యక్తిని తొక్కి చంపేశాయి. ఆపరేషన్ గజ కార్యక్రమం కోసం శిక్షణ పొందిన ఏనుగులను రప్పిస్తున్నారు. ఒక ఏనుగు చిత్తూరు నుంచి, రెండు ఏనుగులు కర్ణాటక నుంచి వస్తున్నాయి.

దాదాపు 30 మంది నిపుణులు ఆపరేషన్ గజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే 20 మంది నిపుణులు పని చేస్తున్నారు. అస్సాం నుంచి భుజానంద చౌదరి నుంచి రప్పిస్తున్నారు. వారం రోజుల్లో ఏనుగుల సమస్యను తీర్చగలమని నిపుణులు అంటున్నారు. ఏనుగులకు మత్తు మందు ఇచ్చే పట్టేసే దిశలో కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఏ మోతాదులో మత్తు మందు ఇవ్వాలనేది తేల్చడానికి హైదరాబాద్ నుంచి నవీన్ అనే వైద్యుడు వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X