పేలుళ్ల కేసులో బాషా, అన్సారీలకు జీవిత ఖైదు
కోయంబత్తూర్:
కోయంబత్తూరులో
1998లో
సంభవించిన
వరుస
బాంబు
పేలుళ్ల
కేసులో
ప్రధాన
నిందితులు
ఆల్-ఉమ్మా
అధ్యక్షుడు
ఎస్ఏ
బాషా,
కార్యదర్శి
మహ్మద్
అన్సారీలకు
జీవిత
ఖైదు
శిక్షను
విధిస్తూ
కోర్టు
తీర్పు
చెప్పింది.
ఈ
కేసులో
ప్రధాన
కుట్రదారులుగా
వారిపై
అభియోగాలు
రుజువు
కావడంతో
ఈ
శిక్ష
విధించింది.
దీంతో
పాటు
వారిపై
నమోదైన
మరో
12
అభియోగాల్లో
మూడు
నుంచి
9
ఏళ్ల
పాటు
జైలుశిక్ష
విధిస్తున్నామని
తెలిపింది.
ఏకకాలంలోనే
ఈ
రెండు
శిక్షలను
అమలు
చేయాలని
ఆదేశించింది.
బాషా,
అన్సారీలు
చట్టవ్యతిరేకంగా
రహస్య
కార్యకలాపాలను
సాగించారని,
1998
బాంబు
పేలుళ్లలో
వీరు
ప్రధాన
నిందితులని
రుజువుకావటంతో
జడ్జి
ఈ
మేరకు
తీర్పు
చెప్పారు.
వీరు
గత
9
ఏళ్లుగా
పోలీసు
కస్టడీలో
ఉన్నారు
కనుక
జీవిత
ఖైదు
శిక్ష
కాలాన్ని
తగ్గించామని
తెలిపారు.కోయంబత్తూరులో
1998
ఫిబ్రవరి
14న
జరిగన
ఈ
వరుస
బాంబు
పేలుళ్ల
సంఘటనలో
58
మంది
దుర్మరణం
చెందగా,
దాదాపు
250
మంది
తీవ్రంగా
గాయపడ్డారు.
అలాగే
కోట్లాది
రూపాయల
మేర
ఆస్తి
నష్టం
జరిగింది.