వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ కు 40 కోట్లు ఎక్కడివి?: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews


కడప: ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి 40 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. 9 లక్షల రూపాయల నుంచి జగన్ ఆస్తులు 40 కోట్లకు ఎలా పెరిగాయని ఆయన అడిగారు.

వరద తాకిడికి గురైన కడప జిల్లాలో పర్యటించడానికి వచ్చిన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బినామీ పేర్లతో కోట్లాది రూపాయల భూములను అన్యాక్రాంతం చేశారని ఆయన విమర్శించారు.

పంటలకు గిట్టుబాటు ధరలు లభించకనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. వరికి గిట్టుబాటు ధర కల్పించకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని, ఈ దేశవ్యాప్త ఉద్యమానికి ఈ నెల 26వ తేదీన శ్రీకారం చుడుతామని ఆయన చెప్పారు.

కడప జిల్లాను వరదలు తాకినప్పుడు ముఖ్యమంత్రి ఈ జిల్లాలోనే ఉన్నారని, అయినా సహాయచర్యలు అమలు కాలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సేవలో మునిగిపోయిన అధికారులు వరదలకు ప్రజలను వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X