వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాధ, నెహ్రూల గొడవ తెలియదు: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews


గుంటూరు: తమ పార్టీ కాంగ్రెస్ శాసనసభ్యులు దేవినేని నెహ్రూ, వంగవీటి రాధాకృష్ణల వ్యవహారం తనకు తెలియదని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. రాధాకృష్ణ రాజీనామా విషయం కూడా తనకు తెలియదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభా సమావేశాల తీరు బాగా లేదని ఆయన అన్నారు. శాసనసభా సమావేశాలు గాడి తప్పుతున్నాయని, అందుకు అందరూ బాధ్యులేనని ఆయన అన్నారు. జూనియర్ శాసనసభ్యులను సరిచేయాల్సిన సీనియర్ సభ్యులు, జూనియర్ల మాటలను పట్టుకుని గొడవకు దిగుతున్నారని ఆయన అన్నారు.

వరికి మద్దతు ధరపై తాము వీధులకెక్కబోమని ఆయన అన్నారు. వరి ధర ఏదో కొంత మేరకు పెరుగుతుందని, అయితే పెరిగిన ధర వచ్చే ఏడాది నుంచి అమలవుతుందని ఆయన చెప్పారు. వరికి మద్దతు ధర సాధించేందుకు కొందరు ప్రాణాలర్పిస్తామని అంటున్నారని, తాము ప్రాణాలర్పించలేమని ఆయన పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశంచి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X