హైదరాబాద్ లో బంగ్లదేశ్ యువకుడి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్. రెహ్మాన్ అనే ఈ యువకుడికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతనికి యుకెలోని వివిధ వ్యక్తుల నుంచి నిధులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వాటిని తమ మిత్రులు, బంధువులు పంపారని రెహ్మాన్ చెబుతున్నాడని, ఈ వ్యవహారాన్ని పరిశీలించాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
ప్రతినిధులు మాత్రమే పాల్గొనే ఫిదా - ఎ - మిలాయత్ ప్రతినిధుల సదస్సుకు రెహ్మాన్ హాజరయ్యాడని, ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్న ఈ సదస్సుకు అతను పోలీసుల కళ్లు గప్పి హాజరయ్యాడని వారు చెప్పారు. ఆ యువకుడి నుంచి పోలీసులు రేషన్ కార్డు, పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నారు. తాను చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు రెహ్మాన్ చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications
