వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: దేవేందర్ గౌడ్

By Staff
|
Google Oneindia TeluguNews


Devender Goud హైదరాబాద్: శాసనసభలో తమ వ్యవహారశైలిని తెలుగుదేశం పార్టీ సమర్థించుకుంది. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలుగుదేశం శాసనసభ్యుడు టి. దేవేందర్ గౌడ్ బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. స్పీకర్ బెదిరింపులకు తాము లొంగేది లేదని ఆయన అన్నారు. స్పీకర్ ఎవరి మీద అలుగుతున్నారు, తమను బెదిరిస్తున్నారా అని ఆయన అడిగారు. బిసిలకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తే స్పీకర్ కు కోపం ఎందుకు రావాలని ఆయన ప్రశ్నించారు.

బిసిలకు జరుగుతున్న అన్యాయంపై తాము ప్రభుత్వాన్ని నిలదీశామని, మూడున్నర ఏళ్లుగా బిసిలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, తాము దాని గురించి ప్రస్తావించామని ఆయన అన్నారు. కోట్ల రూపాయల భూములు అమ్ముతున్నారని, బిసిలకు కేటాయించడానికి నిధులు ఎందుకుండవని ఆయన అన్నారు. బిసిలకు సరిగా నిధులు కేటాయించడం లేదనే విషయాన్ని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని ఆయన అన్నారు. ఆ విషయం ప్రస్తావించలేనప్పుడు సభ ఎందుకని ఆయన అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X