వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగ్విజయ్ తో భేటీ మర్యాదపూర్వకమే: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews


Y S Rajasekhar Reddy హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ ను ముఖ్యమంత్రి బుధవారంనాడు లేక్ వ్యూ అతిథి గృహంలో కలుసుకున్నారు. వారి మధ్య దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. తాము రాజకీయాల గురించి చర్చించలేదని ముఖ్యమంత్రి చెప్పారు.

ఉషా మెహ్రా కమిటీ నివేదిక అందిన వెంటనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చర్యలు తీసుకుంటామని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. వర్గీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని తాను దిగ్విజయ్ ని కోరినట్లు, దాంతో దిగ్విజయ్ ఆ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X