వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ సత్తా అంబుడ్స్ మన్ కమిటీ

By Staff
|
Google Oneindia TeluguNews


Jayaprakash హైదరాబాద్: పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణకు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అంబుడ్స్ మన్ కమిటీని వేశారు. ఈ కమిటీలో మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి కాకి మాధవరావు, జస్టిస్ రెడ్డప్ప రెడ్డి ఉంటారు. తెలంగాణకు చెందిన ఒక విశిష్ట న్యాయమూర్తిని కూడా ఈ కమిటిలో వేస్తామని జయప్రకాశ్ నారాయణ గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్టీ కమిటీలన్నింటినీ అంబుడ్స్ మన్ కమిటీ పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు.

అంబుడ్స్ కమిటీ వేయడం రాజకీయాల్లోనే సరికొత్త విధానమని ఆయన అన్నారు. పారదర్శకంగా ఉండడానికే ఈ కమిటీని వేసినట్లు చెప్పారు. కమిటీలోని వారికి రాజకీయాలతో ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడిని బ్యాలెట్ ద్వారా ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X