వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు సమస్యలే ఎజెండా: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రైతు సమస్యలే ప్రధాన ఎజెండా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ సమావేశంలో ఆయన సోమవారం ఆ విధంగా అన్నారు. రైతు సమస్యలు ఎక్కడ ఉంటే తమ పార్టీ అక్కడ ఉంటుందని ఆయన అన్నారు.

కేంద్రం మెడలు వంచైనా సరే పంటలకు గిట్టుబాటు ధర ఇప్పిస్తామని ఆయన అన్నారు. వరికి వేయి రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన విమర్శించారు. తాము అధికారంలో వస్తే వికలాంగులకు వేయి రూపాయల పింఛను ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X