వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్ పల్లి కోర్టులో రాజిరెడ్డి: పోలీసుల మోహరింపు

By Staff
|
Google Oneindia TeluguNews


కరీంనగర్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లు రాజిరెడ్డి అలియాస్ సత్తెన్నను పోలీసులు శుక్రవారం సాయంత్రం కరీంనగర్ జిల్లా మెట్ పల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. ఇందుకుగాను కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. రాజిరెడ్డి బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. రాజిరెడ్డి తరఫున పిటిషన్ వేయడానికి వచ్చిన న్యాయవాదిని పోలీసులు అడ్డుకున్నారు.

రాజిరెడ్డిని, ఆయన భార్య సంగీతను పోలీసులు కేరళలోని ఆళువ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. అనంతరం వారిద్దరిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. 24 గంటలలోగా కోర్టులో హాజరు పరచాల్సి ఉండగా కేరళ నుంచి తీసుకురావడానికి సమయం పడుతోందని, దాని వల్ల తమకు మరింత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు. శనివారం ఉదయం వరకు రాజిరెడ్డిని, ఆయన భార్యను కోర్టులో హాజరు పరచడానికి రేపు ఉదయం వరకు సమయం ఉంది. రాజిరెడ్డిని, ఆయన భార్య సుగుణ అలియాస్ సంగీతను పోలీసులు శుక్రవారం ఉదయానికి హైదరాబాదుకు తీసుకొచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X