వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమితాబ్ తల్లి తేజీ బచ్చన్ కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews


ముంబై: బాలీవుడ్ బాదుషా అమితాబ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్ శుక్రవారం కన్నుమూశారు. ఆమె ఏడాది కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. ఏడాది నుంచి ఆమె ముంబైలోని లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆమెకు 93 ఏళ్లు. తన తండ్రి 2003లో మరణించిన తర్వాత తల్లిని అమితాబ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తరుచుగా ఆమెను పరామర్శించడానికి వెళ్లి రావడం ఆయనకు తన జీవితంలో ఒక భాగమైంది.

కూలీ సినిమా కోసం రాసిన తొలి స్క్రప్టులో అమితాబ్ నటించిన పాత్ర మరణిస్తుంది. అయితే సినిమా ముగింపును మార్చాలని, అందుకు తనకు వ్యక్తిగత కారణాలున్నాయని అమితాబ్ తల్లి తేజీ దర్శకుడు మన్మోహన్ దేశాయ్ ని కోరారు. చాలా కాలంగా తేజీ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ అమితాబ్ కుటుంబానికి ఒక బలంగా ఉంటూ వస్తున్నారు. పెళ్లయిన తర్వాత అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ చేసిన మొదటి పని తేజీని దర్శించుకోవడం. కుటుంబ నిర్ణయాల్లో అమితాబ్ ఎల్లవేళలా ఆమె సలహానే అమితాబ్ పాటించేవారని అంటారు. తేజీ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితురాలు. గాంధీ, బచ్చన్ కుటుంబాల మధ్య తేజీ అనుసంధానకర్త.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X