తర్వాతే చిరుతో పొత్తు ఆలోచన: సిపిఐ
గుంటూరు / హైదరాబాద్: విధివిధానాలను చూసిన తర్వాతనే మెగాస్టార్ చిరంజీవి పెట్టే పార్టీతో పొత్తుపై ఆలోచిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గుంటూరులో అన్నారు. చిరంజీవి పార్టీని తాము స్వాగతిస్తున్నామని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసుల ఏకఛత్రాధిపత్యం పోవాలని, అందుకు రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అన్నారు. కొత్త పార్టీలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) బలం తగ్గిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ రాజీనామాలు రాజకీయ ఎత్తుగడ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఐదేళ్ల కోసం ఎన్నుకున్న తర్వాత టీఆర్ఎస్ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లడం హాస్సాస్పదమని ఆయన అన్నారు. చిరంజీవి పెట్టే పార్టీ లౌకిక పార్టీ అయితే తాము స్వాగతిస్తామని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. చిరంజీవి మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి బిజెపితో అవగాహనకు రావచ్చుననే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాఘవులు హైదరాబాదులో ఆ వ్యాఖ్యలు చేశారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications