తర్వాతే చిరుతో పొత్తు ఆలోచన: సిపిఐ
గుంటూరు / హైదరాబాద్: విధివిధానాలను చూసిన తర్వాతనే మెగాస్టార్ చిరంజీవి పెట్టే పార్టీతో పొత్తుపై ఆలోచిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గుంటూరులో అన్నారు. చిరంజీవి పార్టీని తాము స్వాగతిస్తున్నామని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసుల ఏకఛత్రాధిపత్యం పోవాలని, అందుకు రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అన్నారు. కొత్త పార్టీలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) బలం తగ్గిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ రాజీనామాలు రాజకీయ ఎత్తుగడ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఐదేళ్ల కోసం ఎన్నుకున్న తర్వాత టీఆర్ఎస్ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లడం హాస్సాస్పదమని ఆయన అన్నారు. చిరంజీవి పెట్టే పార్టీ లౌకిక పార్టీ అయితే తాము స్వాగతిస్తామని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. చిరంజీవి మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి బిజెపితో అవగాహనకు రావచ్చుననే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాఘవులు హైదరాబాదులో ఆ వ్యాఖ్యలు చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications