ఇప్పుడే పుట్టిన పార్టీ పీఆర్పీ: డిఎస్

పిసిసి కార్యవర్గంపై తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు విమర్శలు చేసినట్లు తన దృష్టికి రాలేదని ఆయన అన్నారు. ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలుంటే తన వద్దకు వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడితే వివరణ ఇస్తానని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీలను కార్యవర్గంలో వేసుకుంటే ఎన్నికల సమయంలో తనకు గాంధీభవన్ లో అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. అలా కాకుండా వేరే వారిని వేసుకుంటే టికెట్లు వస్తే తనకు అందుబాటులో ఉండరని, టికెట్లు రానివారు అసంతృప్తికి గురై దూరంగా ఉంటారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సమయంలో తనకు అందుబాటులో ఉండేవారిని కార్యవర్గంలో వేసుకున్నామని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications
