మావోయిస్టులతో చర్చిస్తాం: చిరు పార్టీ

కాల్పుల విరమణ, బూటకపు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ, పోరాటావిర్భావానికి మూలకారణాలైన వెనకబాటుతనం, గిరిజనుల భూ ఆక్రమణలు, వనసంపద వినాశనం, గిరిజనులను దోచుకునే విధానాలను రూపుమాపడం, జనజీవన స్రవంతిలోకి వచ్చే మావోయిస్టులకు పునరావాసం కల్పించి సహకరించటంతో పాటు రాష్ట్రంలో చట్టానికి, రాజ్యాంగానికి విఘాతం కలిగించకుండా శాంతిభద్రతల విషయంలో రాజీ పడకుండా కచ్చితంగా వ్యవహరించటం తమ విధాన మని తెలిపారు.
మావోయిస్టుల సమస్యను శాంతిభద్రతల సమస్యగా కాకుండా సామాజక, ఆర్థిక, రాజకీయ సమస్యగా పరిగణిస్తామన్నారు. ఈ విషయమై పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అధ్యక్షతన అనుభవజ్ఞులతో మరింత లోతుగా చర్చించి విధివిధానాలను ప్రకటిస్తామని తెలిపారు. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చించి మోసపోయిన మావోయిస్టులు మీ మాటలు విశ్వసిస్తారని భావిస్తున్నారా అని ప్రశ్నించగా తాము చిత్తశుద్ధి, నిజాయితీలతో తమ విధానాన్ని ప్రకటిస్తున్నందున ప్రజలు నమ్ముతున్నట్లే వారు కూడా విశ్వసిస్తారన్న నమ్మకం తమకుందని తెలిపారు.












Click it and Unblock the Notifications
