వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబెరాయ్, తాజ్ ల్లో తాజా కాల్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

Taj Residency
ముంబయి: ముంబయిలోని ఒబెరాయ్, తాజ్ మహల్ హోటళ్లలో గురువారం ఉదయం తాజాగా కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ హోటళ్లలోకి చొరబడిన టెర్రరిస్టుల కోసం ఆర్మీ కమెండోలు ఈ హోటళ్లలోకి ప్రవేశించారు. కొంత మంది విదేశీయులను టెర్రరిస్టులు బందీలుగా పట్టుకున్నారు. తాజ్ హోటల్లో ముగ్గురు లేదా నలుగురు టెర్రరిస్టులు ఉండవచ్చునని భావిస్తున్నారు. తాజ్ హోటల్లో వంద మంది దాకా గెస్టులు ఉన్నారు. కొలాబాలోని నారిమాన్ హౌస్ వద్ద కూడా గురువారం ఉదయం కాల్పులు జరిగాయి.

తొమ్మిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు, విద్యాసంస్థలను గురువారం మూసివేసినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్ ఆర్ పాటిల్ చెప్పారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ చెప్పారు. ఆర్మీ కమెండోలతో పాటు నావికా దళాల కమెండోలను, రాపిడ్ యాక్షన్ ఫోర్సును రంగంలోకి దించారు. పోలీసులు ఇప్పటి వరకు రెండు స్టెన్ గన్ లను స్వాధీనం చేసుకున్నారు. తాజ్, ఒబెరాయ్ హోటళ్లలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని విలాస్ రావు దేశ్ ముఖ్ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X