వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎటిఎస్ చీఫ్, మరో 11 మంది బలి

By Staff
|
Google Oneindia TeluguNews

Hemant Karkare
ముంబయి: టెర్రరిస్టుల దాడిలో తీవ్రవాద నిరోధక బృందం (ఎటిఎస్) చీఫ్ మరో ముగ్గురు ఎటిఎస్ ఉన్నతాధికారులతో పాటు 11 మంది పోలీసులు మరణించారు. మాలెగావ్ పేలుళ్ల కేసును దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర ఎటిఎస్ చీఫ్ హేమంత్ కర్కారే, అదనపు కమీషనర్ అశోక్ కామ్టే, ఎన్ కౌంటర్ స్పెషలిస్టు విజయ్ సలాస్కర్ ముంబయిలోని కామా ఆస్పత్రి వద్ద జరిగిన కాల్పుల్లో మరణించారు.

కర్కారే 1982 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. రాలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో ఎటిఎస్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. థానే, వాసి, పన్వేల్ వరుస బాంబు పేలుళ్ల కేసుల చిక్కుముడులు విడదీయడంలో ఆయన విజయం సాధించారు. మాలెగావ్ పేలుళ్ల కేసు మిస్టరీని విడదీసిన ఘనత కూడా ఆయనదే. విజయ్ సలాస్కర్ 1983 బ్యాచ్ ఐపియస్ ఆఫీసర్. ఎదురుకాల్పుల్లో ఆయన 75 మంది కిరాతక నేరగాళ్లను హతమార్చాడు. అశోక్ ఆమ్టే ముంబయి ఒకటో జోన్ డిసిపి. ఈయన ముంబయిలోని రాష్ట్ర పోలీసు అధికారుల్లో కీలకమైనవాడు. ఈయన సోలాపూర్ కమీషనరుగా పనిచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X