వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజ్ హోటల్ బందీలకు విముక్తి

By Staff
|
Google Oneindia TeluguNews

Taj Residency
ముంబయి: తాజ్ హోటల్ లో ఉగ్రవాదుల చెరలో ఉన్నవారికి విముక్తి లభించింది. అయితే ఒబెరాయ్ హోటల్లోని, నారిమన్ హౌస్ లోని బందీలకు ఇంకా విముక్తి కలగలేదు. ఈ రెండు చోట్లు ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలను మహారాష్ట్ర చీఫ్ ఎఎన్ రాయ్ ఖండించారు. తాజ్ హోటల్లోని వారందిరికీ విముక్తిలభించినట్లు ఆయన తెలిపారు. 12 మంది ఉగ్రవాదులు దాడులకు దిగినట్లు చెబుతున్నారు. ఉగ్రవాదుల దాడిలో 101 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు అమెరికా ఇంటలిజెన్స్ అధికారులు కూడా ఉన్నారు.

టెర్రరిస్టులు చావడమో, తమ చేతికి చిక్కడమో త్వరలోని జరిగిపోతుందని ఆయన అన్నారు. తాజ్, ట్రైడెంట్ (ఒబెరాయ్) హోటళ్లలో దాదాపు వంద మంది దాకా ఉగ్రవాదుల చెరలో ఉన్నారని అనుమానిస్తున్నారు. తాజ్ హోటల్లోకి గురువారం ఉదయం నలుగురైదుగురు టెర్రరిస్టులు చొరబడ్డారు. హోటల్లో 40, 50 మంది దాకా ఆ సమయంలో ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X