వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్‌ పోలింగ్ ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం ప్రారంభమైంది. 230 స్థానాలకు పోటీ పడుతున్న 3180 మంది అభ్యర్థుల భవితవ్యం గురువారం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నిక్షిప్తం కానుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రులు అర్జున్‌సింగ్‌, కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌సింగ్‌ తదితరులు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ కూడా చివరి దశలో ప్రచారంలో మెరిపించారు.

బీజేపీ తరఫున ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎల్‌.కె.అద్వానీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, నవజ్యోత్‌సింగ్‌ సిద్ధు, అనంతకుమార్‌ తదితర ప్రముఖ నేతలు ప్రచారం చేశారు. ప్రచారం మొత్తంగా అటు బీజేపీ అభివృద్ధి నినాదం... ఇటు కాంగ్రెస్‌ అవినీతి ఆరోపణలు... కేంద్రాలుగా సాగింది. ఇప్పుడు ప్రజలు ఎటువైపు మొగ్గుతారో వేచి చూడాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X