వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రిరిస్టులు పడవల్లో వచ్చారు

By Staff
|
Google Oneindia TeluguNews

Vilasrao Deshmukh
ముంబయి: ముంబయిలో గత రాత్రి బీభత్సం సృష్టించిన టెర్రరిస్టులు పడవల్లో వచ్చారని, పది చోట్ల కాపు కాశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ చెప్పారు. ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు మరణించారని, 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన గురువారం తెల్లవారుజామున మీడియా ప్రతినిధులతో చెప్పారు.

టెర్రరిస్టుల దాడులు బుధవారం రాత్రి 9, 9 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ప్రారంభమయ్యాయని, విచక్షణారహిత కాల్పులకు, బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. టెర్రరిస్టులు వచ్చి ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారని, వారెంత మంది ఉన్నారనే విషయం వెంటనే తెలియరాలేదని ఆయన అన్నారు. గ్రెనేడ్లు విసిరి కాల్పులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ నుంచి 200 మంది జాతీయ భద్రతా బలగాల సిబ్బంది వచ్చారని ఆయన చెప్పారు. విదేశీయులను ఉగ్రవాదులు లక్ష్యం చేసుకున్నారా అని అడిగిన ప్రశ్నకు అలా అని చెప్పలేమని ఆయన జవాబిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X