వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబెరాయ్ లో ఇద్దరు టెర్రరిస్టుల కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయి: హోటల్ ఒబెరాయ్ ట్రైడెంట్ లో జాతీయ భద్రతా దళాల కమెండోలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చేశారు. హోటల్ ఒబెరాయ్ పూర్తిగా తమ స్వాధీనంలోకి వచ్చిందని ఎన్ఎస్జీ చీఫ్ చెప్పారు. కమెండోలు ప్రతి గదినీ తనిఖీ చేస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి కమెండోలు ఎకె - 47ను, పేలని గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.

అంతకు ముందు కమెండోలు ఒబెరాయ్ హోటల్ నుంచి 148 మందిని విడిపించారు. వీరిలో ఎక్కువగా విదేశీయులే ఉన్నారు. తాజ్ హోటలో ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అలాగే కమెండోలు నారిమన్ హౌస్ లోకి దూసుకెళ్లారు. నారిమన్ హౌస్ లోని మూడో అంతస్థులో ఉగ్రవాదులకు, కమెండోలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. హెలికాప్టర్ లో కమెండోలు నారిమన్ హౌస్ పై అంతస్థుకు చేరుకున్నారు. ఇక్కడ పది మంది ఇజ్రాయెలీలు ఉగ్రవాదుల చెరలో ఉన్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X