వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు లష్కరే మిలిటెంట్ల అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయి: ముంబయిలోని తాజ్ హోటల్లో ముగ్గురు లష్కరే తోయిబా మిలిటెంట్లను భద్రతా దళాల సిబ్బంది అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఒక పాకిస్తానీ ఉన్నాడు. పాకిస్తానులోని ఫరీద్ కోటకు చెందిన అజ్మల్ అమీర్ ఖాన్ ను భద్రతా సిబ్బంది అరెస్టువారిలో ఉన్నాడు. ఉగ్రవాదులతో జాతీయ భద్రతా దళాలు చేస్తున్న పోరాటం చివరి అంకానికి చేరుకుంది. తాజ్ హోటల్లోని వారందరినీ రక్షించినట్లు ముంబయి పోలీసు కమిషనర్ హసన్ గఫూర్ చెప్పారు.

ఒబెరాయ్, నారిమాన్ హౌస్ ల్లో దాక్కున్న మిలిటెంట్ల కోసం జాతీయ భద్రతా దళాలు తమ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆయన ఆశించారు. గుజరాత్ నుంచి ముంబయి 12 మంది టెర్రరిస్టులు వచ్చినట్లు ఆయన తెలిపారు. గత అర్థరాత్రి నుంచి ఒబెరాయ్ హోటల్ నుంచి ఏ విధమైన కాల్పుల శబ్దాలు వినిపించడం లేదు. తాజ్ లో ఆపరేషన్ ముగిసిందని, ఒబెరాయ్ లో చివరి దశకు చేరుకుందని ఆయన చెప్పారు. కాగా, ముంబయి దాడులకు సంబంధించి మరణించిన వారి సంఖ్య 138కి చేరుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X