టెర్రరిస్టుల తాజా ఇ-మెయిల్ బెదిరింపు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మరిన్ని దాడులను జరుపుతామని దక్కన్ ముజాహిదీన్ ఒక గుజరాతీ ఛానల్కు ఈమెయిల్ను పంపింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం, బాంబే స్టాక్ ఎక్సేంజ్, కళాశాలలు, పాఠశాలలపై దాడులు జరుపుతామని ఉగ్రవాదులు పేర్కొన్నారు. ఈ మెయిల్ సౌదీ అరేబియా నుంచి వచ్చినట్టు నిఘాసంస్థలు గుర్తించాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా గుజరాత్లోపటిష్ట భద్రతాచర్యలను చేపట్టారు.
ముంబయి దాడులకు తామే కారణమని దక్కన్ ముజాహిదీన్ అనే సంస్థ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. బిఎస్ఇకి చాలా కాలంగా ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంది. తాజ్, బిఎస్ఇపై దాడి చేయాలని ఉగ్రవాదులు మొదట పథకం సిద్ధంగా చేసుకున్నారని, అయితే ఆ తర్వాత తమ పథకాన్ని మార్చుకున్నాయని నిఘా వర్గాలంటున్నాయి. తాజా ఇ- మెయిల్ బెదిరింపు విషయంలో ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న అబ్దుల్ సుభాన్ పాత్రపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ప్రతి దాడి తర్వాత ఇ-మెయిల్ ను పంపింది అతనే కావడం విశేషం.