వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫెడరల్ ఏజెన్సీ ఏర్పాటు: ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: ముంబయి దాడుల నేపథ్యంలో ఫెడరల్ దర్యాప్తు సంస్థ(ఎఫ్‌ఐఏ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఎన్‌ఎస్‌జీ(జాతీయ భద్రత దళం) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మన్మోహన్‌ తెలిపారు. ఆదివారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గగన, సముద్రతల భద్రతను కట్టుదిట్టం చేయనున్నట్లు చెప్పారు. ఉగ్రవాదుల సవాలును ఎదుర్కొనేందుకు సంకుచిత రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రయోజనాల కోసం అందరం కలిసి పనిచేయాలని చెప్పారు. ఉగ్రవాదుల చర్యలు మనల్ని మరింత ఏకం చేస్తాయి తప్ప విడదీయలేవని ఉగ్రవాదులు, దేశ శత్రువులు ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని ఆయన అన్నారు.

అఖిల పక్ష సమావేశానికి ప్రతిపక్ష నేత అద్వానీ, భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌, శివసేన నాయకులు హాజరుకాలేదు. భాజపా తరఫున జశ్వంత్‌సింగ్‌, విజయ్‌కుమార్‌ మల్హోత్రా వచ్చారు. రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్నందునే అద్వానీ ఈ భేటీకి రాలేకపోయినట్లు సమాచారం. గతంలో దేశంపై జరిగిన దాడులతో ఈసారి జరిగిన దాడులకు పోలిక లేదని ప్రధాని చెప్పారు. సమావేశం తీరు పట్ల బిజెపి అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలోనే ఈ తరహా సమావేశాలను ఏర్పాటు చేయాల్సిందని వ్యాఖ్యానించింది. ఈ దాడిలో పాక్‌ పాత్ర ఉన్నట్లు తేలితే ఈ విషయాన్ని ఐరాస భద్రత మండలి దృష్టికి తీసుకెళ్లాలని వామపక్షాలు సూచించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X