వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫెడరల్ ఏజెన్సీ ఏర్పాటు: ప్రధాని
అఖిల పక్ష సమావేశానికి ప్రతిపక్ష నేత అద్వానీ, భాజపా అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, శివసేన నాయకులు హాజరుకాలేదు. భాజపా తరఫున జశ్వంత్సింగ్, విజయ్కుమార్ మల్హోత్రా వచ్చారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందునే అద్వానీ ఈ భేటీకి రాలేకపోయినట్లు సమాచారం. గతంలో దేశంపై జరిగిన దాడులతో ఈసారి జరిగిన దాడులకు పోలిక లేదని ప్రధాని చెప్పారు. సమావేశం తీరు పట్ల బిజెపి అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలోనే ఈ తరహా సమావేశాలను ఏర్పాటు చేయాల్సిందని వ్యాఖ్యానించింది. ఈ దాడిలో పాక్ పాత్ర ఉన్నట్లు తేలితే ఈ విషయాన్ని ఐరాస భద్రత మండలి దృష్టికి తీసుకెళ్లాలని వామపక్షాలు సూచించాయి.
Comments
Story first published: Monday, December 1, 2008, 9:19 [IST]