రాజస్థాన్ లో కాంగ్రెస్, ఎంపిలో బిజెపి
న్యూఢిల్లీ: రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసే దిశగా సాగుతోంది. మధ్యప్రదేశ్ లో మాత్రం బిజెపి ముందంజలో ఉంది. ఢిల్లీలో హోరాహోరీ పోరు సాగుతోంది. ఛత్తీస్ ఘడ్ లో కూడా ఇరు పార్టీల మధ్య హోరాహోరీ ఉంది. మిజోరంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అయితే ఇంకా కొంత సమయం తీసుకుంటే తప్ప ఏ పార్టీ ఎక్కడ పాగా వేస్తుందనే విషయం స్పష్టంగా చెప్పలేని స్థితి.
మధ్యప్రదేశ్ శాసనసభలో 230 స్థానాలు ఉండగా బిజెపి పది స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలిచింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప 31 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బిజెపి 20 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. రాజస్థాన్ లో 200 స్థానాలున్నాయి. ఢిల్లీలో 69 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బిజెపి 8 స్థానాలను, కాంగ్రెస్ స్థానాలను ఆధిక్యతలో సాగుతోంది. మిజోరంలో కాంగ్రెస్ 3 స్థానాలను, మిజో నేషనల్ ఫ్రంట్ రెండు స్థానాలను గెలుచుకునే దిశగా సాగుతున్నాయి.