హస్తం గుర్తుపై నాదెండ్ల కథనం
గుంటూరు: కాంగ్రెస్(ఐ) పార్టీ తన ఎన్నికల చిహ్నంగా 'హస్తం' ఎంచుకోవడంపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తన ఆత్మకథలో ఆసక్తికర సమాచారాన్ని వెల్లడించారు. కంచి శంకరాచార్య సూచన మేరకే పార్టీ ఈ గుర్తును ఎంచుకున్నట్లు అందులో పేర్కొన్నారు. గతంలో ఓసారి మదనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇందిరాగాంధీతోపాటు తాను శంకరాచార్యను కలిశామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా.. తన నేతృత్వంలో కొత్తగా ఆవిర్భవించిన కాంగ్రెస్(ఐ)కి ఎన్నికల గుర్తు సూచించాల్సిందిగా ఇందిరాగాంధీ శంకరాచార్యను కోరారు. అందుకు ఆయన 'హస్తం' సరైందన్నట్లుగా తన చేయిని గాలిలోకి వూపారు. ఆ క్షణానే ఇందిర తన పార్టీకి హస్తం గుర్తును ఖరారు చేసినట్లు భాస్కరరావు వివరించారు. ఈ విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదని పుస్తకంలో పేర్కొన్నారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications