పాక్ లో పేలుడు: 20 మంది మృతి
పెషావర్: పాకిస్థాన్ పార్లమెంటుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం పాక్లో హింస చెలరేగింది. నైరుతీ పాకిస్థాన్లోని బునిర్ పట్టణంలోని ఓ పోలింగ్ స్టేషన్ వద్ద శక్తిమంతమైన కారు బాంబు పేలడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది గాయపడ్డారు. బాంబు ధాటికి పోలింగ్ జరుగుతున్న స్కూలు భవనమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా భారీగా దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications