కావాలనే చిరుపై'రోడ్ షో'కేసు?
ఆ రోజు..ఏపీ 29-వీ1 వాహనంలో సాయంత్రం 5.15 గంటలకు పట్టణంలోకి ప్రవేశించిన చిరంజీవి పాతబస్టాండ్ వద్ద వాహనాన్ని ఆపి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఆ సమయంలో అంబేద్కర్ సర్కి ల్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. చిరంజీవి అక్కడి నుంచి వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ మెదక్ రోడ్డు పక్కనున్న హైస్కూల్ మైదానికి వెళ్లారు.
ఇక సిద్దిపేట వచ్చి వెళ్లిన ఐదు రోజుల తర్వాత కేసు నమోదు చేయటం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆ పర్యటన రోడ్ షో కిందికి వస్తే అదే రోజు కే సు నమోదు చేసేవారు...ఐదు రోజుల తర్వాత అంటే ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితోనే కేసు పెట్టారని ఓ వర్గం వారు ఆరోపిస్తున్నారు. అంతేగాక ఆ పర్యటన లో చిరంజీవికి ముందు వెనుకా ఉన్న పోలీసు వాహనాలు ఉన్నా వారు ఎలాంటి హెచ్చరికలూ చేయలేదని అంటున్నారు.
Comments
Story first published: Tuesday, December 30, 2008, 9:05 [IST]