సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కావాలనే చిరుపై'రోడ్ షో'కేసు?

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
సిద్దిపేట : పీఆర్పీ అధినేత చిరంజీవి సిద్దిపేట వచ్చి వెళ్లిన ఐదు రోజుల తర్వాత ఆయనపై ఆ పార్టీ నాయకులపై కేసు నమోదైంది. ప్రజా అంకిత యాత్రలో భాగంగా నెల 24న మెదక్‌ జిల్లా సిద్దిపేటలో పర్యటించిన పీఆర్పీ అధినేత చిరంజీవితో పాటు ఆ పార్టీ నాయకులపై సోమవారం న్యూసెన్స్‌ యాక్ట్‌ కేసు నమోదు చేసినట్లు వన్‌ టౌన్‌ ఎస్‌ఐ సురేందర్‌రెడ్డి తెలిపారు.

ఆ రోజు..ఏపీ 29-వీ1 వాహనంలో సాయంత్రం 5.15 గంటలకు పట్టణంలోకి ప్రవేశించిన చిరంజీవి పాతబస్టాండ్‌ వద్ద వాహనాన్ని ఆపి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. ఆ సమయంలో అంబేద్కర్‌ సర్కి ల్‌ వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. చిరంజీవి అక్కడి నుంచి వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ మెదక్‌ రోడ్డు పక్కనున్న హైస్కూల్‌ మైదానికి వెళ్లారు.

ఇక సిద్దిపేట వచ్చి వెళ్లిన ఐదు రోజుల తర్వాత కేసు నమోదు చేయటం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆ పర్యటన రోడ్‌ షో కిందికి వస్తే అదే రోజు కే సు నమోదు చేసేవారు...ఐదు రోజుల తర్వాత అంటే ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితోనే కేసు పెట్టారని ఓ వర్గం వారు ఆరోపిస్తున్నారు. అంతేగాక ఆ పర్యటన లో చిరంజీవికి ముందు వెనుకా ఉన్న పోలీసు వాహనాలు ఉన్నా వారు ఎలాంటి హెచ్చరికలూ చేయలేదని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X