Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ధోనీకి బెదిరింపు లేఖ, భద్రత పెంపు

Mahendra Singh Dhoni
రాంచి: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బెదిరింపు లేఖ అందింది. తక్షణం యాభై లక్షల రూపాయలు చెల్లించకపోతే కుటుంబ సభ్యుల అంతు చూస్తామన్నది ఆ లేఖ సారాంశం. ఈ లేఖ పర్యవసానంగా ధోనీకి, ఆయన కుటుంబసభ్యులకు సెక్యూరిటీని పెంచినట్టు పోలీసు అధికారులు బుధవారం ఉదయమే ప్రకటించారు.

దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఈ లేఖను తెచ్చి, ధోనీ కుటుంబ సభ్యులకు అందజేసినట్టు సమాచారం. అయితే ఆ లేఖ ఎంతో దూరం నుంచి రాలేదని ధోనీ నివాస ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న కాలనీ నుంచి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. "స్ధానిక నేరస్ధులే" ఆ లేఖను పంపించి ఉండవచ్చని పోలీసులు అంటున్నారు.

అండర్ వరల్డ్ మాఫియా హస్తం గురించి ఎటువంటి ఆధారాలు లేవని జార్ఖండ్ పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ ఎ ఎన్ ప్రధాన్ చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆయన తెలిపారు. ధోనీకి ఇప్పటికే జెడ్ క్యాటగిరీతో సమానమైన సెక్యూరిటీ ఉందని, ఈ బెదిరింపు లేఖ పర్యవసానంగా ఇంకా అదనపు పోలీసు బలగాలను ఇచ్చామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+