చిరు పర్యటనపై పోలీస్ కన్ను
మంగళవారం కొవూరు, ఆత్మకూరు, నింజమూరు, కావలిలో చిరంజీవి ప్రజా అంకిత సభలు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల పీఆర్పీ నాయకులు చిరు సభలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ రోజు కావలిలో సభానంతరం కడనూతలోన్ని ఆర్.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రాత్రికి చిరంజీవి బస చేస్తారు. బుధవారం ఇంజనీరింగ్ కళాశాల సముదాయాన్ని చిరంజీవి ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని స్థానిక పీఆర్పీ నేతలు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే వివిధ గ్రామాల్లో చిరంజీవిని చూసేందుకు రోడ్లు పైకి వస్తున్న జనాన్ని చూసి,ఆయన కేవలం మూగ సైగలతోనే సరిపెడుతున్నారు. అయినప్పటికీ కాన్వాయ్ లో ఎక్కువ కార్లు ఉన్నందున కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. చిరవకు మీడియా వాహనాలు కూడా కాన్వాయ్ లో లెక్క చూపించి ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నారు.
రెండు రోజుల పర్యటనలో ఒక సభ నుండి రెండో సభకు వెళ్ళే దారిలో బారులు తీరిన ప్రజలను పలకరించటాన్ని కూడా పోలీసులు తప్పు పడుతున్నారు. ఇప్పటివరకూ దాదాపు ముఫ్పై చోట్ల ఈ తరహా తప్పిదాలు జరిగాయని పోలీసులు లెక్కించారని తెలుస్తోంది. మరో రెండు రోజుల పర్యటనలో మరికొన్ని అంశాలు చేర్చి కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.