హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పబ్లిసిటీకి ఇంత ఖర్చా? చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: ప్రకటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయా న్ని చేతివృత్తిదార్ల సంక్షేమానికి వెచ్చిస్తే వారి కష్టాలు సగం తీరతాయని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. గత ప్రభుత్వ హ యాంలో ప్రకటనల కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ప్రతిపక్షంలో ఉండి పదే పదే ఆరోపించిన కాంగ్రెస్‌ నేతలు నేడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు.

ప్రచారం కోసం కో ట్ల రూపాయల ప్రజాధనా న్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. పీఆర్పీ అధికారంలోకి వస్తే చేతివృత్తిదార్లకు సగం ధర కే విద్యుత్‌ పథకాన్ని ప్రకటించిన సందర్భంగా అభినందనలు తెలిపేందుకు పలు చేతి వృత్తిదార్ల సం ఘాల నేతలు గురువారం పార్టీ కార్యాలయంలో చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.

బడుగు, బలహీన వర్గాలతో పాటు చేతి వృత్తిదార్ల జీవితాల్లో వెలుగులు తీసుకు వస్తామని భరోసా ఇచ్చారు. 'ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పత్రికా ప్రకటనలకే పరిమితమైంది. 80 లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రకటించిన సర్కారు ఇప్పటి వరకు ఎన్ని కట్టించి ఇచ్చిందో లెక్క చెప్పాలి. ఈ విషయంలో సంబంధిత మంత్రి, అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతనే కుదరడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X