విశాల్ హత్య కేసు: నిందితుడి అరెస్టు
వాషింగ్టన్ : అమెరికాలోని జెట్ ఎయిర్వేస్లో సత్యం కంప్యూటర్స్ నుంచి డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న ఆంధ్రుడు విశాల్ అక్షయ్ (26) హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. అక్షయ్ హత్య కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న జాన్సన్ (20) అనే నల్లజాతీయున్ని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసులో ఇప్పటికే 12 మందిని విచారించారు. అయితే జాన్సన్పై మూడు హత్య, 12 దోపిడీ కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు. డబ్బు దోపిడీ కోసమే విశాల్ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
నాలుగేళ్ల కిందట జనవరి 13నే అమెరికాకు పయనమైన విశాల్... సరిగ్గా అదే రోజున హత్యకు గురి కావడం అతని తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను మిగిల్చింది. బీఎస్ఎన్ఎల్లో హైదరాబాద్ లో డీజీఎంగా విధులు నిర్వహిస్తున్న నంద లక్ష్మణమూర్తి, శాంతాదేవిల ఏకైక కుమారుడు అక్షయ్ విశాల్. సీబీఐటీ నుంచి బీటెక్ పూర్తి చేసిన అక్షయ్.. 2005 జనవరి 13న ఎంఎస్ అభ్యసించటానికి అమెరికా వెళ్లాడు. అలాస్కా యూనివర్శిటీ నుంచి ఎంఎస్ పూర్తి చేశాడు.