'వైఎస్-రామలింగరాజు గుసగుసలు'
హైదరాబాద్: లొంగిపోవడానికి ముందురోజు సత్యం కంప్యూటర్స్ మాజీ ఛైర్మన్ రామలింగరాజు ముఖ్యమంత్రి వైఎస్తో మంతనాలు జరిపారని ప్రజారాజ్యం పార్టీ రాజకీయ అధికార ప్రతినిధి రామచంద్రయ్య తీవ్రంగా ఆరోపించారు. శిక్షను తప్పించుకోవడానికి ఎలా చేస్తే బాగుంటుందని చర్చించుకుని, ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే లొంగుబాటు డ్రామాను తెరపైకి తెచ్చారని విమర్శించారు.
పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. మేటాస్ ప్రాపర్టీస్, మేటాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు భూములు, ప్రాజెక్టులు కట్టబెట్టడంలో కాంగ్రెస్ పెద్దలకు పెద్దఎత్తున ముడుపులు ముట్టాయని, వాటి గుట్టు రట్టు కావాలంటే కేసును సెబీ, ఆర్వోసీలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ మొత్తం ఉదంతంలో రాజకీయ పెద్దలకు ప్రమేయం ఉందని, వారికి ముట్టాల్సింది ముట్టిందని, కేసును నీరుగార్చాలన్న ఉద్దేశంతోనే సెబీ, ఆర్వోసీలకు అప్పగించకుండా సీబీసీఐడీ విచారణకు ఆదేశించారని ఆరోపించారు. సత్యం ఉద్యోగులను ఆదుకోవచ్చని.. కానీ బెయిల్ అవుట్ రూపంలో మార్గం చూపడం సరికాదన్నారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications