హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కల్యాణ్ పై పోలీసు ఆంక్షలు

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన సంచలనం సృష్టిస్తోంది. ఆయన కాన్వాయ్ లో ఐదుకు మించి వాహనాలు ఉండరాదని జిల్లా పోలీసులు నిబంధన విధించారు. దీనితో ఆగ్రహం చెందిన ప్రజారాజ్యం కార్యకర్తలు ధర్నాకు దిగారు. పవన్ కళ్యాణ్ నేటి ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చి సరిగ్గా 11.30కి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై టీఅర్ ఎస్ కే అవగాహన లేదని, సామాజిక తెలంగాణ ఏర్పడాలన్నది తమ ఆశయమని ఆయన చెప్పారు.

యువరాజ్యం అధినేత పవన్‌కల్యాణ్‌ నేటినుంచి 4 రోజులపాటు కరీంనగర్‌ జిల్లాలో పర్యటిస్తారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి తన పర్యటనను ప్రారంభిస్తారు. ఈరోజు 3 మండలాల్లో 20 గ్రామాల్లో ఆయన పర్యటిస్తారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. చిరంజీవి కూడా తన పర్యటనను కరీంనగర్‌ జిల్లానుంచే ప్రారంభించటం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X