చిరు ఆఫీస్ పై బాలయ్య ఫ్యాన్స్ రాళ్ళు
అనంతపురం: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన నందమూరి బాలకృష్ణ రెండో రోజైన శుక్రవారం అనంతపురం జిల్లా లేపాక్ష్క్షి మండలం నుంచి రోడ్ షో ప్రారంభించారు. అనంతపురం జిల్లా చిలమత్తూరులో ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంపై బాలకృష్ణ అభిమానులు దాడి చేశారు. చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు రాళ్ళు విసురుకున్నారు. ఉద్రిక్త పరిస్ధితి చోటు చేసుకుంది. కాంగ్రెస్ అవినీతి పాలనపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలకు అదుపులేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి అనుచరులు కోట్లు దోచుకుంటున్నారన్నారు.
సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా 27 ఏళ్ల క్రితం ఎన్టిరామారావు తెలుగు దేశం పార్టీ ప్రారంభించినా క్రియాశీలక రాజకీయాలకు తాను దూరంగానే వున్నానని, ప్రస్తుతం ఆయన ఆశయాల సాధనకే వచ్చానని నందమూరి బాలకృష్ణ అశేష జనవాహిని మధ్య ప్రకటించారు. రైతు బజార్ల ద్వారా నేరుగా అన్నదాతలు పంటలను విక్రయించుకునే సౌలభ్యం, ప్రతి నీటి చుక్కా భూమిలో ఇంకించే ఇంకుడు గుంతలు లాంటి పథకాలు చంద్రబాబుతోనే సాధ్యమయ్యాయన్నారు.
సామాజిక న్యాయం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆశయాలన్నాయని గుర్తు చేశారు. ప్రజల వద్దకు పాలనను ప్రారంభించిన ఘనత తెలుగు దేవవ పార్టీదేనన్నారు. ఎన్టిఆర్ పాలన అంతా నీతివంతంగా సాగిందని, నిరుపేదలందరికీ అందుబాటులో ఉండాలనే రూ.2ల కిలోబియ్యం ప్రారంభించారన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టిఆర్దేనన్నారు.
ఆ ఆశయాలనే చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. బాలయ్య రాకతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. తర్వాత పెడపల్లి, తాడిమర్రి, బుక్కపట్నం, కనగాపల్లి మండలాల్లో బాలకృష్ణ రోడ్షోలు జరగనున్నాయి.