వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'ముంబై కుట్ర పాక్ లో కాదు'
లండన్: ముంబై పేలుళ్లకు కుట్ర తమ దేశమైన పాకిస్ధాన్ లో జరగలేదని, తమ దర్యాప్తు సంస్థల ప్రకారం ఈ కుట్రకు పథక రచన మరెక్కడైనా జరిగి ఉండవచ్చని బ్రిటన్లో పాక్ రాయబారి వాజిద్ శాంసుల్ హసన్ పేర్కొన్నారు. ఓ ఛానల్ విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
మీరు చెప్పినా భారత్తో సహా ఎవరూ దాన్ని నమ్మరని అనగా ఎందుకు నమ్మరు మా వాదనకు తగిన ఆధారాలను మేం చూపిస్తాం అని ఆయన జవాబిచ్చారు. పాక్ ఈ విషయాన్నే చెప్పబోతున్నట్లు పాక్ మీడియా కూడా వెల్లడించింది. తమ దర్యాప్తు సంస్థల నివేదికను రెండుమూడు రోజుల్లో బహిర్గతం చేస్తామని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహ్మాన్ మాలిక్ కూడా ప్రకటించారు.
Comments
Story first published: Friday, January 30, 2009, 15:07 [IST]