మావోయిస్టుల అణిచివేతకు కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: మావోయిస్టులను అణిచివేయడం కోసం కేంద్రం వ్యూహాలను రూపొందించే పనిలో పడింది. నాలుగు రోజుల క్రితం మహారాష్టల్రోని మావోయిస్టులు 15 మంది పోలీసులను హత్య చేయడంతో కేంద్రం దీనిపై తీవ్రంగా స్పందించింది. వివిధ రాష్ట్రాల సీఎంలతో ఇటీవలే దీనిపై సమావేశం జరిపిన కేంద్రం రాష్ట్రాలమధ్య సమన్వయం లోపించిందని అభిప్రాయపడింది. దీంతో హోంశాఖ ఆధ్వర్యంలో నక్సల్స్ అణచివేతకు వ్యూహాలు రూపొందించి భారీ ఎత్తున రంగంలోకి దిగాలని నిర్ణయించింది. నక్సల్స్ బాధిత రాష్ట్రాల్లో ఒకేసారి భారీ దాడులు చేస్తే ఫలితం ఉంటుందని కూడా కేంద్రం భావిస్తోంది. చత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లలో నక్సల్స్ ఎక్కువగా కార్యకలాపాలు సాగించే సరిహద్దు ప్రాంతాలను గుర్తించి ఆయా రాష్ట్రాల పోలీసులతో సమన్వయంగా దాడులు చేయాలని భావిస్తున్నారు. బీహార్, ఒరిస్సాలో కూడా నక్సల్స్ ప్రాంతాల్లో ఇదే వ్యూహాన్ని అమలుచేయాలని భావిస్తున్నారు. కావలసిన బలగాల గురించి ప్లాన్ చేయాలని కూడా రాష్ట్రాలను కోరారు. అయితే పశ్చిమబెంగాల్ మాత్రం దీనిపై రాజకీయ పరిష్కారం అవసరమంటుంది.