వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్లో 50 ఉగ్రవాద శిక్షణా శిబిరాలు
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, అదీ ఎల్ఒసి రేఖకు 10 కిలోమీటర్ల సమీపంలోనే ఎక్కువ శాతం ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నడుస్తున్నాయని శనివారం ఆర్మీ చీఫ్ దీపక్ కపూర్ వెల్లడించారు. ఈ ఉగ్రవాద శిక్షణ శిబిరాలకు పాక్ రిటైర్డ్ ఆర్మీ అధికారులే నేతృత్వం వహిస్తున్నారనీ ఆయన ఆరోపించారు. ఇలా శిక్షణ పొందిన వారిన భారత్పైకి దాడులకు పురిగొల్పుతోందన్నారు.
పాకిస్థాన్లో 50 వరకూ ఉగ్రవాద శిక్షణా శిబిరాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ శిబిరాల్లో వందలాది మంది ఉగ్రవాదులకు వేగంగా, చురుగ్గా శిక్షణ కొనసాగుతోందని ఆయన చెప్పారు. 2003లో 32 వరకూ ఉన్న ఉగ్రవాద శిక్షణా శిబిరాల సంఖ్య ప్రస్తుతం 53 వరకూ చేరుకున్నదని వివరించారు.
Comments
Story first published: Saturday, February 7, 2009, 14:30 [IST]