హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఒక్కటి స్పీకర్ కే తెలియదట

By Staff
|
Google Oneindia TeluguNews

Suresh Reddy
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శాసనసభలో ఏ అంశంపై ప్రకటన చేస్తారో స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డికే తెలియదట. సాధారణంగా అసెంబ్లీలో చర్చించే అంశాలపై అన్ని పక్షాలతో చర్చించి స్పీకర్‌ ఎజెండాను రూపొందిస్తారు. దానిప్రకారమే ఆయన సభా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎజెండాలో అన్ని అంశాలు స్పష్టంగా ఉంటాయి. అయితే గురువారం మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. గురువారం ఎజెండాలో సభలో ముఖ్యమంత్రి ఓ అంశంపై ప్రకటన చేస్తారని ఇచ్చారు. ఆ ఒక్కటి ఏమిటన్నది విపక్షాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఆ ఒక్కటి ఏమిటని అడిగితే స్పీకర్‌ కూడా తెలియదన్నారని, ఇదేం విచిత్రమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యుడు జి.కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆ ఒక్కటీ తెలంగాణా గురించిన ప్రకటన అని అధికార పార్టీ సభ్యులు అంటున్నారు. అదే అయితే తాము తీర్మానం చేయాలని పట్టుబడతామని విపక్షాలు అంటున్నాయి. ఈ విషయంపై తమ వైఖరిని నిర్ణయించుకోవడానికి మహా కూటమి నేతలు సమావేశమయ్యారు. మొత్తంమీద ఆ ఒక్కటీ ఏమిటన్నది మరికాసేపట్లో తేలనుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X