కేరళలో 11 మంది ఆంధ్రుల మృతి
కొట్టాయం: కేరళ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. వారిని చికిత్స నిమిత్తం కొట్టాయంలోని వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. కేరళలోని ఎలిమేరి వద్ద మంగళవారం తెల్లవారు జామున ఐదు గంటల ప్రాంతంలో పంబా నది లోయలో పడింది. మృతుల్లో 9 మంది మహిళలున్నట్లు సమాచారం.
ప్రయాణికులంతా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో 50 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. శబమరిలై తీర్థయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెలుతురు సరిగా లేనందున, రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబాలకు శబరిమలై ఆలయ కమిటీ లక్ష రూపాయలేసి నష్టపరిహారం ప్రకటించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications