హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అది పాలకొల్లు బస్సు: హెల్ప్ లైన్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేరళలో ప్రమాదానికి గురైన బస్సు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని లక్ష్మీ ట్రావెల్స్ కు చెందింది. ప్రయాణికులు 18 రోజుల దక్షిణ భారత యాత్ర కోసం ఈ నెల 11వ తేదీన పాలకొల్లు నుంచి బయలు దేరారు. కన్యాకుమారి, శ్రీశైలం, మహానంది, రామేశ్వరం వంటి తీర్థప్రదేశాల సందర్శనకు వారు బయలు దేరారు. ఆ రోజు లక్ష్మీ ట్రావెల్స్ కు చెందిన నాలుగు బస్సులు దక్షిణ భారత యాత్రకు బయలుదేరాయి. వీటిలో ఏ బస్సు ప్రమాదానికి గురైందనే విషయం తెలియడం లేదు.

బస్సు ప్రమాదంలో మరణించిన యాత్రికులు దువ్వ, తణుకు, వేల్పూరు, కట్టవపాడు, ద్వారకా తిరుమలకు చెందినవారిగా భావిస్తున్నారు. అయితే వారు ఏ గ్రామానికి చెందినవారనేది నిర్దిష్టంగా తెలియడం లేదు. బస్సు ప్రమాదంలో మరణించిన 11 మంది మృతుల్లో వి.లక్ష్మినర్సు, మంగాయమ్మ, వెంకాయమ్మ, సూర్యకాంతం, రత్తమ్మ, శశి, పార్వతి, సత్యనారాయణ, శేషారత్నం, లక్ష్మి ఉన్నట్లు సమాచారం.

హెల్ప్ లైన్: 09447056334

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X