తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసుకు ప్రచారం చేస్తా: రాజశేఖర్

By Staff
|
Google Oneindia TeluguNews

Rajasekhar
తిరుపతి: వచ్చే ఎన్నికల్లో తాను కాంగ్రెసు పార్టీకి ప్రచారం చేస్తానని సినీ నటుడు రాజశేఖర్ చెప్పారు. సత్యమేవ జైయతే సినిమా విడుదల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆయన తన భార్య జీవితతో కలిసి మంగళవారం ఇక్కడికి వచ్చారు. కాంగ్రెసు ప్రచార బాధ్యతల్లో పాలు పంచుకుంటానని ఆయన చెప్పారు. సత్యమేవ జయతే విజయం సాధించిందని, సినిమాను అందరూ మెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలని, ఇస్తారని ఆయన అన్నారు.

తాము పదవుల కోసం కాంగ్రెసు పార్టీలో చేరలేదని జీవిత అన్నారు. తామేమీ పార్టీ పట్ల అసంతృప్తితో లేమని ఆమె స్పష్టం చేశారు. తాము పదవుల కోసం ఎదురు చూడడం లేదని ఆమె అన్నారు. పదవులుంటేనే పార్టీలో పని చేయాలని లేదని, పదవులు లేకున్నా పని చేయవచ్చునని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X