కాపులకు 75 టికెట్లకై డిమాండ్
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాపులకు 75 అసెంబ్లీ, 11 పార్లమెంటు సీట్లను కేటాయించాలని కాపునాడు వివిధ రాజకీయ పార్టీలను కోరింది. ఈమేరకు బుధవారం కాపునాడు చైర్మన్ మిరియాల వెంకటరావు, కన్వీనర్ వెంకటేశ్వరరావు, యువకాపునాడు అధ్యక్షులు కరుణాకర్ నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 94 నియోజకవర్గాల్లో కాపుల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ పార్టీల అధ్యక్షులు కాపులకు కోరిన మేరకు సీట్లు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Story first published: Thursday, February 19, 2009, 11:49 [IST]