Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎల్లుండి సోనియా రాష్ట్ర పర్యటన

Sonia Gandhi
హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర పర్యటన మరోసారి మారింది. పీసీసీకి చేరిన సమాచారం ప్రకారం ఈనెల 27న ఉదయం 11 గంటలకు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం సోనియా గాంధీ పోర్ట్‌బ్లెయిర్‌కు వెళతారు. మళ్లీ 28న సాయంత్రం నాలుగు గంటలకు సికింద్రాబాద్‌ బహిరంగ సభలో పాల్గొంటారు.

అభ్యర్థుల ఎంపిక కసరత్తులో కీలకమైన ఎన్నికల కమిటీ మార్చి 2, 3 తేదీల్లో గాంధీభవన్లో సమావేశం కానుంది. ఆ రెండు రోజుల్లోనే 294 అసెంబ్లీ, 42 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ప్రాథమిక జాబితాను సిద్ధం చేస్తుంది. పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌, వైఎస్‌ సమక్షంలో జరిగే ఈ భేటీకి వీరప్ప మొయిలీ, కురియన్‌, కృష్ణకుమార్‌ హాజరవుతారని భావిస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి రెండు మూడు పేర్లతో జాబితా రూపొందిస్తారు. అనంతరం ఢిల్లీలో మార్చి ఐదారు తేదీల్లో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీకి దానిని సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న అంచనా ప్రకారం.. నెలాఖరులోపు ఎన్నికల తేదీ లు ప్రకటిస్తే..మార్చి ఆరో తేదీనాటికి కాంగ్రెస్‌ తన తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+