వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎంబీఏ విద్యార్ధి యాక్సిడెంట్ లో మృతి
హైదరాబాద్: హైదరాబాద్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంబిఎ విద్యార్థి మృతి చెందాడు. బండ్లగూడ సమీపంలో ఓ లారీ ఎంబిఎ విద్యార్థి రూపేష్ను ఢీకొంది. విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో ఆగ్రహించిన విద్యార్ధులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
Story first published: Saturday, February 28, 2009, 12:45 [IST]