వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుర్తుపై మళ్ళీ కోర్టుకెళ్ళనున్న చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: ప్రజారాజ్యం పార్టీపై పోటీచేసే అభ్యర్థులందరికి ఉమ్మడి గుర్తుపై మరోసారి కోర్టును ఆశ్రయించాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయంలో న్యాయపరంగా ఉన్న అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. దీనిపై న్యాయనిపుణులతో భేటీ అయిన చిరంజీవి.. 'గుర్తు' పై చివరివరకూ పోరాడతామని తెలిపారు.

ఉమ్మడి గుర్తు రాకపోతే ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ప్రజారాజ్యం నాయకులు ఆందోళన చెందుతున్నారు. తమ గుర్తుపై ప్రజారాజ్యం పోటీ చేసుకోవచ్చని ఎన్ సిపి అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్ ఆఫర్ చేయడం, దాని మీద సీనియర్లతో చర్చించిన తర్వాత చిరంజీవి ఆ ప్రతిపాదనను తిరస్కరించడం జరిగిపోయాయి. ఎన్ని న్యాయపోరాటాలు చేసినా ఉమ్మడి గుర్తు రాకపోతే చిరంజీవి పార్టీ జయలలిత నాయకత్వంలోని ఎఐడిఎంకె గుర్తును గానీ, ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాది పార్టీ గుర్తును కానీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎస్పీ గుర్తు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిలే కావడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X